ఏపీలో కొత్తగా 1520 కరోనా కేసులు, 10 మరణాలు

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఏపీని వదిలేలా లేదు. ఆంధ్ర ప్రదేశ్‌ లో మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త పెరిగాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1520 కరోనా కేసులు నమోదయ్యాయి.

ap carona
ap carona

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,18,200 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 10 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,887 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14, 922 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1290 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,89,391లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 64, 739 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,68, 09, 7874 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news