MAA ELECTIONS : ప్యానల్‌ ను ప్రకటించిన ప్రకాశ్‌రాజ్‌… తప్పుకున్న జీవిత, హేమ !

-

మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి ప్యానెల్‌ సభ్యులను ప్రకటించారు. తన ప్యానల్‌ ను అందరూ కలిసి డిసైడ్‌ చేశారని…. చిత్ర పరిశ్రమకు సేవ చేయాలనే నేపథ్యంలో తాను ఈ బరిలో ఉంటున్నానని చెప్పారు. తామేంటో ఎన్నికల్లో గెలిచాక చూపిస్తామన్నారు ప్రకాశ్‌ రాజ్‌. అంతేకాదు.. తమ ప్యానెల్‌ ఎక్కువగా మహిళలకు చోటు కల్పించామని తెలిపారు.

ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెలు సభ్యులు :

అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ ఉండనుండగా… ఉపాధ్యక్షుడిగా బెనార్జీ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా హేమ,  శ్రీకాంత్,  ఆయన తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా జీవిత ఉండనున్నట్లు పేర్కొన్నారు ప్రకాశ్‌ రాజ్‌.
జాయింట్ సెక్రటరీ లుగా అనిత చౌదరి, ఉత్తేజ్ మరియు కోశాధికారి నాగి నీదు ఉండనున్నారు.  అనసూయ, అజయ్, భూపాల్ బ్రహ్మాజీ ఈటీవీ ప్రభాకర్, గోవిందరావు, ఖయుమ్ అలీ బ్రదర్, కౌశిక్,  ప్రగతి, రమణ రెడ్డి, శ్రీధర్ రావు, శివ రెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు. పాత కళాకారుడు, సురేష్ కొండేటి, తనీష్, టార్జన్ ప్యానెల్‌ సభ్యులు గా ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news