200 కి 200 స్థానాలు రావాలి : సీఎం జగన్

-

వచ్చే ఎన్నికల్లో 200కి 200 స్థానాల్లో వైసీపీ విజయం సాధించాలని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్దం సభలో మాట్లాడారు జగన్. 175 అసెంబ్లీ స్థానాలకు 175.. 25 పార్లమెంట్ స్థానాలకు 25 ఎంపీలు గెలువాలన్నారు. ఎం.ఏ. ఎకానమిక్స్ చదివి.. బీఈడీ పూర్తి చేసిన వీరాంజనేయులు.. చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగం దొరక్క లారీ డ్రైవర్ అయ్యాడు. చంద్రబాబు హయాంలో టిప్పర్ డ్రైవర్ అయితే.. మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులు ని సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు.

పేదవాడికి అండగా ఉండే జగన్ కి.. పెత్తందారికి అండగా ఉండే   చంద్రబాబు కి ఉన్న తేడా గమనించండి. ఈ ఎన్నికల్లో మోసాలు, మాయమాటలు, కుట్రలు, కుతంత్రాలు చేసే కూటమిని గెలిపించకండి. కూటమిని గెలిపిస్తే.. పదేళ్లు వెనక్కి వెళ్లినట్టే అన్నారు. మీ బిడ్డ జగన్ ను గెలిపిస్తే.. విద్య, వైద్యం, ఇళ్లు, ఫించన్ ఇలా అన్ని మీకు సకాలంలో అందుతాయి. మాయ మాటలు చెప్పే చంద్రబాబుకి పట్టం కడితే.. మీరు మోసపోతారని సూచించారు. 2014లో మాయ మాటలు చెప్పి.. అధికారంలోకి వచ్చాడని.. మరోసారి అదే కూటమి అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తోందన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news