జూన్ 04 తరువాత బటన్లు అన్నీ నొక్కుతా : సీఎం జగన్

-

ప్రభుత్వ పథకాల నిధులను ఈసీ అడ్డుకోవడం పై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కోరుకొండ రోడ్డు షోలో పాల్గొని ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేశారు. ప్రజలకు మంచి జరుగకుండా చేశారు. వీళ్లు పథకాలను అడ్డుకున్నా.. మీ బిడ్డ విజయాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. జూన్ 04న మళ్లీ అధికారంలోకి వస్తాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే బటన్లు అన్నీ నొక్కుతానని సీఎం జగన్ తెలిపారు.

ఈసారి రాష్ట్రంలో పేదలు, పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతుందని తెలిపారు. ఓటు వేసే ముందు ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడండి.. ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించాలని సూచించారు సీఎం జగన్. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ పథకాల అమలుకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news