ఏపీలో కూటమి భారీ మెజార్టీతో గెలవబోతుంది : చంద్రబాబు

-

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి బంపర్ మెజారిటీతో గెలవబోతోందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఎగ్జిట్ పోల్స్ విడుదల, ఎల్లుండి కౌంటింగ్ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఉండవల్లి నివాసం నుంచి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా హజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూటమి నేతలకు చంద్రబాబు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు బేజషాలు పక్కన పెట్టి సమష్టిగా కృషి చేశారని అన్నారు. కౌంటింగ్ రోజున వైసీపీ విద్వేశాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని, ఇప్పటికే ఆ పార్టీ అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేస్తోందని అన్నారు. ప్రతి నియోజవర్గ పరిధిలో కూటమి నేతలు తమ నాయకులు కార్యకర్తలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో జగన్ తిరకాసు పెట్టేందుకు ప్రయత్నించాడని ఆరోపిచంచారు. అందుకే, ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, విజయం సాధించిన తరువాత డిక్లరేషన్ ఫాం తీసుకున్నాకే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి రావాలని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news