స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు.. హైకోర్టుకు ఈసీ నివేదిక

-

గాజు గ్లాసు గుర్తు కేటాయింపు అంశంపై హైకోర్టుకు ఎన్నికల సంఘం  నివేదిక సమర్పించింది. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు..దాని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లలోనూ, అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని ఈసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలగుతాయని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు.. విచారణ ముగిసింది.

తమ పార్టీ పోటీలో లేనిచోట్ల స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించొద్దంటూ హైకోర్టును జనసేన ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై విచారణ జరిగింది. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్. న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు తెలిపారు. ఆ మేరకు నేడు ఈసీ నివేదిక అందజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news