సీఎం జగన్ బటన్ నొక్కి ఎంత బొక్కాడో కక్కిస్తా : చంద్రబాబు

-

సీఎం జగన్ బటన్ నొక్కి ఎంత బొక్కాడో అది అంత కక్కిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ప్రజాగళం సభలో మాట్లాడారు చంద్రబాబు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మీకు నష్టం జరిగిందో తెలుసుకోండి. పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయి. చెత్త ముఖ్యమంత్రి చెత్త మీద కూడా పన్ను వేశాడు.

ఐదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఒక్క డీఎస్సీ కూడా వేయలేకపోయాడు.  తాను అధికారంలోకి వస్తే.. మొదటి సంతకం మెగా డీఎస్సీ అని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ని మార్చేస్తాయి. ఐదేళ్లు నరకం, సంక్షోభం, సమస్యలకి చెక్ పెట్టండి. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయా..? లేదా.. ఇక నాణ్యతలేని మద్యం తాగితే గోవింద.. కియా వచ్చిందంటే అది మన బ్రాండ్. జాకీ కంపెనీ పోయిందంటే అది జగన్ బ్రాండ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news