గవర్నర్ కావాలని ఉంది.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కామెంట్స్ వైరల్..!

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల హడావిడి చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. అధికారం మాది అంటే మాది అంటూ అటు అధికార, ఇటు ప్రతిపక్ష కూటమికి చెందిన నేతలు పేర్కొంటున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలోనే వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన మనస్సులో ఉన్న కోరికను బయటపెట్టారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుకోలేదని తెలిపారు.

కేవలం తమ నాయకుడు సీఎం జగన్ ఆదేశాలను అనుసరించి తాను ఎంపీగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా తనకు గవర్నర్ కావాలనే కోరిక ఉందని వెల్లడించారు విజయసాయి రెడ్డి. ఇక ఇదే విషయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా తెలియజేశానని తెలిపారు. తన రాజకీయ రిటైర్మెంట్ తరువాత గవర్నర్ ని చేయమని తమ నాయకుడు జగన్ ని కోరినట్టు వెల్లడించారు. తన కోరికను మన్నించి జగన్ సిఫారస్ చేస్తే.. తాను గవర్నర్ గా చేస్తానని తెలిపారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news