నేను వైఎస్ బిడ్డననే విషయం మరువద్దు.. షర్మిల మాస్ వార్నింగ్

-

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలోని లింగాలలో షర్మిల శుక్రవారం సభ నిర్వహించారు. ఈ క్రమంలో జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ వైసీపీ శ్రేణులు వైఎస్ షర్మిల, సునీత ప్రసంగాలను అడ్డుకున్నారు.

వైసీపీ శ్రేణుల ఆందోళనపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు .ఓటమి భయంతోనే వైసీపీ కార్యకర్తలు రచ్చ చేస్తు్న్నారని ఆమె మండిపడ్డారు . తాను కూడా కడప జిల్లాకు చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డననే విషయం మరిచిపోకూడదని వైసీపీ శ్రేణులకు వైఎస్ షర్మిల మాస్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌ను, ఎంపీ అవినాష్‌ను గెలిపిస్తే వాళ్లు మీకు చేసిందేంటో చెప్పాలని వైఎస్ షర్మిల ఆందోళనకారులను నిలదీశారు. ఈ సభలో తీవ్ర ఉద్రిక్త నెలకొనడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి కాంగ్రెస్, వైసీపీ వర్గాలను చెదరగొట్టారు.

.

Read more RELATED
Recommended to you

Latest news