చంద్రబాబు పై సజ్జల ఫైర్.. అందుకేనా..?

-

వాలంటీర్లపై గతంలో చంద్రబాబు, దత్తపుత్రుడు విషం కక్కారని… ఇప్పుడు సడెన్ గా ప్రేమ కురిపిస్తారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఫైర్ అయ్యారు. గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తామన్న చంద్రబాబు ప్రస్తుతం వారికి రూ.10 వేలు ఇస్తామంటున్నారని తెలిపారు.

ఇక  ఇప్పటికీ చంద్రబాబు గతంలానే మాటలు మారుస్తున్నారన్నారు. వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీలను తీసుకొస్తారని తెలిపారు. వారు చెప్పిన వాళ్లకే స్కీములు ఇస్తారన్నారు. ప్రస్తుతం తాము ఇస్తున్న స్కీమ్స్ చంద్రబాబు తీసేస్తారన్నారు. గొడవలు వాళ్లే సృష్టించి నిందలు తమపై చేస్తున్నారన్నారు. నాలుగు ఓట్ల కోసమే చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లపై గతంలో తప్పుడు ప్రచారం చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news