కొత్త జిల్లాల ప్లాన్ మాదే అంటున్న సోము వీర్రాజు

-

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు వేగంగా అందుకుంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు ప్లాన్ మాదే అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం పెరుగుతుందని ఆయన అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రణాళికనను 2014 మానిఫెస్టోలో పెట్టామని…ఇప్పడు ప్రభుత్వం దాన్ని అమలుచేస్తుందని ఆయన అన్నారు. దీనిని బట్టి బీజేపీ ముందుచూపును ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. స్థానికులు అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాలకు పేర్లు పెట్టాలని ఆయన సూచించారు.

తాజాగా ఏపీలో ఉన్న 13 జిల్లాలను విభజించి కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని మొత్తంగా 26 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే దీానిని కేబినెట్ ఆమోదించింది. నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ప్రతీ లోక్ సభ నియోజవర్గం ప్రాతిపదికగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ జిల్లాలో రెండు గిరిజనులక కోసం ఏర్పాటు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news