ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన కరోనా.. నేడు 8 కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుంది. అయితే రాష్ట్రంలో నిన్న‌టితో పోలిస్తే.. ఈ రోజు క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. ఈ రోజు క‌రోనా బులిటెన్ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 3,686 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష ఫలితాల్లో 8 క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యాయి.

కాగ గురు వారం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కేవ‌లం 3 కేసులు మాత్ర‌మే న‌మోదు అయ్యాయి. అంటే నిన్న‌టి కంటే ఈ రోజు 5 కేసులు ఎక్కువ‌గా న‌మోదు అయ్యాయి. కాగ రాష్ట్రంలో ఈ రోజు 14 మంది క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య‌.. వంద లోపే ఉన్నాయి.

ప్ర‌స్తుతం 63 యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. అయితే రాష్ట్రంలో గ‌తంలో ఒక్క కేసు మాత్రమే న‌మోదు అయింది. త‌ర్వాత 3 నుంచి నేడు 8 కి చేరింది. కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news