ఏపీలో విషాదం.. ఆర్టీసీ బస్సు కింద పడి 6 ఏళ్ల బాలుడు మృతి

-

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఈశ్వర్ అనే ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇక ఆర్టీసీ బస్సు ఢీకొని ఈశ్వర్ అనే ఆరేళ్ల బాలుడు మృతి చెందడంతో… తీవ్ర ఉద్రిక్తతకు అక్కడి పరిస్థితులు దారితీశాయి.

రావులపాలెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టడంతో తండ్రితో వెళ్తున్న ఈశ్వర్ అనే బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు… స్థానికులు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.‌ రోడ్డుపై ఆందోళన చేపట్టడంతో రాజమండ్రి… ధవలేశ్వరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఈ సంఘఘటన స్థలం వద్దకు పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.‌ ఈ సంఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news