BREAKING : ఏపీలో భారీ పేలుడు..ఇద్దరు మృతి

-

BREAKING : ఏపీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… అనకాపల్లి అచ్చుతాపురం సెజ్ లో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాసేపటి క్రితమే…రెండు రియాక్టర్లు పేలాయి.

దీంతో భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి మంటలు. అటు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి అగ్నిమాపక దళాలు. ఇక ఈ ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. భారీ శబ్దాలు రావడంతో భయపడి… పరుగులు పెడుతున్నారు ప్రజలు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news