“నీతిమాలిన అబద్దాల కోరు చంద్రబాబు…” : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

-

నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఒక రేంజ్ లో విమర్శలు చేశారు. కాకాణి మాట్లాడుతూ రాజకీయాలలో ఉండకూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబేనని అన్నారు. ప్రజల కోసం రాజకీయాలు చేయమంటే స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయాలను నడిపిస్తూ చెడ్డ పేరు తెస్తున్నారన్నారు. చంద్రబాబు నీతి మాలిన ఒక అబద్దాల కోరు అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు కాకాణి. ఇతని రాజకీయ జీవితం ఒకసారి వెనక్కు వెళ్లి చూస్తే అంతా అవినీతిమయం అని వాస్తవాన్ని తెలియచేశారు కాకాణి. గతంలో ప్రజలను మేనిఫెస్టో పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేసిన చరిత్ర టీడీపీది అన్నారు.. మానిఫెస్టోనే ఆన్లైన్ లేకుండా మాయం చేసిన ఘనమైన చరిత్రం చంద్రబాబుది అని ఘోరంగా కాకాణి విమర్శించారు.

ఇప్పుడు మేము చేసిన అభివృద్ధికి ఎక్కడైనా బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము.. చంద్రబాబు వచ్చి తాను చేసిన పాలనపై చర్చించాలని సవాలు విసిరాడు.

Read more RELATED
Recommended to you

Latest news