“వారాహి” యాత్రకు అంబులెన్స్ సిద్ధం

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టే “వారాహి” యాత్రను జనహిత పేరుతో అంబులెన్స్ వాహనం అనుసరించనుంది. అత్యవసర సమయాలలో వైద్య సదుపాయం అందించే విధంగా అంబులెన్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. 8 గంటల లైఫ్ సపోర్టుతో వెంటిలేటర్, మానిటర్ తో పాటు ఆక్సిజన్, ఎమర్జెన్సీ కిట్లు జనహితలో ఉన్నాయి. అత్యవసర మందులు, ప్రాథమిక వైద్యానికి తగిన పరికరాలు కూడా అంబులెన్స్ లో ఉంచారు. జనహితను డాక్టర్ లక్ష్మణరావు చిట్టెం పర్యవేక్షించనున్నారు.

వారాహి వెనుకనే వచ్చే ఈ జనహిత అంబులెన్స్ లో డ్యూటీ డాక్టర్, నర్స్, డ్రైవర్ అందుబాటులో ఉంటారు. జనహిత అంబులెన్స్ ను సోమవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అంబులెన్స్ లోని అత్యాధునిక వైద్య పరికరాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అంబులెన్స్ పర్యవేక్షకుడు డాక్టర్ లక్ష్మణరావు చిట్టెంతో మాట్లాడి ఇతర వివరాలు తెలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ” వారాహి యాత్రలో అంబులెన్స్ అవసరమే రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం” అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news