మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి పాడే మోసిన చంద్రబాబు

-

తెలంగాణలో సీనియర్ రాజకీయ నేత, మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ తర్వాత కోలుకొని మహబూబ్నగర్ లోని చిన్నచింతకుంట మండలంలోని తన స్వగ్రామమైన పర్కాపురం వచ్చారు. అయితే మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా చింతకుంట మండలంలోని పర్కాపురం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపి నుండి దయాకర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు అమరచింత, ఓసారి మక్తల్ నుండి గెలుపొందారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. అయితే నేడు ఆయన అంత్యక్రియలకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం దయాకర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని ఆయన పాడెను చంద్రబాబు భుజానికి ఎత్తుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news