ఏపీలో కరోనా కలకలం.. 5 వేలు దాటిన మరణాలు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,846 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 69 మరణాలు సంభవించాయి. అలాగే నేడు 9,628 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,83,925 కి చేరింది.

ఇందులో 92,353 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా.. 4,86,531 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 5,041 కి చేరింది. అలాగే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 47,31,866 టెస్టులు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news