ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో నేడు మరో పిటిషన్ దాఖలైంది. రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకే చోట అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని శివరామకృష్ణ కమిటీ సూచించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు తీర్పు విషయంలో అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే. ఈనెల 31న అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో మస్తాన్ వలీ దాఖలు చేసిన పిటిషన్ తో పాటు అమరావతి రైతులు దాఖలు చేసిన పిటీషన్ ని కూడా కలిపి సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news