ప్రధాని మోడీని కలవనున్న ఏపీ సీఎం..!

-

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయిన చంద్రబాబు నాయుడు.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించనున్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని “అమరావతి” నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్ లో కేటాయుంచిన 15 వేల కోట్ల రూపాయలు సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

అలాగే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి, ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తుంది. ఇక, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసి రాష్ట్ర విభజన సమస్యలతో పాటు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని.. రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం తోడ్పాటును అందించాలని అభ్యర్ధించనున్నారు ఏపీ సీఎం.

Read more RELATED
Recommended to you

Latest news