వివాదంలో ఏపీ సీఎం జగన్‌..కోర్ట్ ధిక్కార పిటిషన్‌పై 16న విచారణ..!

-

ఏపీ సీఎం జగన్‌ వివాదంలో చిక్కుకున్నారు..ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై లేఖ విడుదల చేశారు..ఆ లేఖ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది..న్యాయమూర్తులుపై లేఖలు రాయడం కొత్త విషయం కానప్పటికి..అది మీడియాకు విడుదల చేయడంలో దేశ వ్యాప్తంగా దుమారం రేపింది..సుప్రీం కోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడంపై ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేనని..జగన్‌కు వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో జీఎస్‌.మణి, సునీల్‌కుమార్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు..చీఫ్‌ జస్టిస్‌కు రాసిన లేఖను బహిరంగపరచడంపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్‌‌లో పేర్కొన్నారు..ఢిల్లీ బార్‌ అసోషియేషన్‌ చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశాయి..

సీఎం జగన్ కోర్టు ధిక్కార పిటిషన్లపై ఈ నెల 16న సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది..ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగన్‌ చర్యలున్నాయని పిటిషనర్లు చెబుతున్నారు..జస్టిస్‌ ఎన్వీ రమణపై సీఎం జగన్‌ నిరాధార ఆరోపణలు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు..జగన్‌ కోర్టులపై నమ్మకాన్ని వమ్ము చేశారని, తన చర్యల ద్వారా రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారని పిటిషనర్లు తెలిపారు..న్యాయస్థానాలపై ఆరోపణలు వస్తే ప్రజల్లోకి వేగంగా వెళ్తున్నాయని, ఇది సమాజానికి చెడు సంకేతాలు పంపుతోందని పిటిషనర్లు వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news