ఏపీలో కొత్తగా మరో 301 కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే..?

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ఏపీని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కరుణ మహమ్మారి కేసులు గత కొంత కాలంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి కరోనా కేసులు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 301 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,67, 556 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 388 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3830 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 49 , 338 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 36 , 373 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 96 , 52 , 114 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో 367 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news