టిడిపికి బిగ్ షాక్ : పెగాసస్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

-

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి పెగాసస్ వ్యవహారం పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలను చేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ ప్రారంభం అయినప్పటి నుంచి ఈ వ్యవహారంపై వైసిపి సభ్యులు చర్చకు తెరలేపారు.

దీనిని టిడిపి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. నేపద్యంలో ఏపీ ప్రభుత్వం పెగాసస్ వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్ పై హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకు రాగా… దానిని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఒక రెండు రోజుల్లో దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. 2017 సంవత్సరంలో జరిగిన ఈ వ్యవహారంపై సబ్ కమిటీ… నిజానిజాలను తెల్చనుంది.

Read more RELATED
Recommended to you

Latest news