అక్టోబరు 2న ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల

-

అక్టోబరు 2న ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. కలెక్టర్ల కాన్ఫరెన్సులో అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అధికారుల బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించిన సీఎం చంద్రబాబు….పొలిటికల్ గవర్నెన్సే ఉంటుందని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం గురించి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించాల్సిందేనని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

AP Vision Document 2047 released on 2nd October

ఇకపై ఆకస్మిక తనిఖీలకు వస్తానని అధికారులు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక చేసిన సీఎం చంద్రబాబు…. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ లను డ్రైన్లలోకి దింపానని నాటి విషయాలను గుర్తు చేశారు. పాలనలో నిబంధనల వైపే కాకుండా మానవత్వ కోణంలో పనిచేయాలని కలెక్టర్లకు సూచించిన సీఎం చంద్రబాబు… ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047ను అక్టోబరు 2 తేదీన విడుదల చేస్తామన్నారు. 2047 కోసం జిల్లాలకూ విజన్ డాక్యుమెంట్ రూపోందించుకోవాలని సూచనలు చేసిన సీఎం చంద్రబాబు…. ఫేక్ ప్రచారాలను కౌంటర్ చేయాలని కలెక్టర్లకు, అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐఎఎస్సుల వ్యవస్థను దిగజార్చేలా గత ఐదేళ్లలో పాలన సాగిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news