ఏపీకి కేంద్రం నుంచి మరో తీపి కబురు..విశాఖ రైల్వే జోన్‌పై ప్రకటన

-

ఆంధ్రప్రదేశ్ కు మోడీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

జోన్ ఏర్పాటుకు సంబంధించిన డి పి ఆర్ పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కొత్త రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం గత ఏడాది బడ్జెట్లో 170 కోట్లు కేటాయించామని ఆయన వివరించారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు డి పి ఆర్ సమర్పించాక కొత్త రైల్వే జోన్, రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటుకు పరిధి, ఇతర అంశాల గురించి చాలా విషయాలు తమ దృష్టికి వచ్చాయని… ఈ అంశాలను లోతుగా పరిశీలించడానికి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news