నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం – కన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఏపీలో నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టిడిపి నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. ఎన్నికలలో పోరాటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నేడు గుంటూరులోని టిడిపి మినీ మహానాడులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలుగువాడి సత్తా చాటి అనతికాలంలోనే అధికారంలోకి వచ్చి.. పేదల కోసం పోరాటం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు.

 

రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు, కార్యకర్తలు పోరాటం చేయాలని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ రాజధాని లో రాక్షస క్రీడ పేరుతో పేదల ఇళ్ల స్థలాలను ఇవ్వడమే నేరచరిత్రకు నిదర్శనమని ఆరోపించారు. రాజధానిని సర్వనాశనం చేసి అమరావతిని చంపడానికి ఇళ్ల స్థలాల నాటకమే జగన్ కుట్రకు రూపం అన్నారు. పేదలపై ఎక్కడలేని ప్రేమ తాను ఒక్కడే చూపిస్తున్నట్లుగా జగన్ నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. వైసిపి పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు కన్నా లక్ష్మీనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news