మరోసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మితే అంతా కలిసి గోదాట్లో దూకడమే – అచ్చెన్నాయుడు

-

అమరావతి: మాలల్లో వచ్చిన చైతన్యంతో రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని నమ్ముతున్నానన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇందిర, వైఎస్, జగన్ వెంటే మాలలు ఉన్నారనే ప్రచారానికి మాలలే చెక్ పెట్టాలన్నారు. కొన్ని వర్గాల ఓట్లు తనకే పడతాయన్నదే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ధైర్యం అని.. ఆ ధైర్యంతోనే అరాచకాలు చేస్తున్నాడని ఆరోపించారు.

దళితులకు అన్యాయం జరుగుతుంటే కొంతమంది దళిత నేతలే మాట్లాడకపోవటం బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం అండతోనే ఎస్సీలు శిరోముండనాలు, హత్యలు, చిత్రహింసలకు గురవుతున్నారని అన్నారు. దళిత మంత్రులు జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తేనే ఎస్సీలకు న్యాయం జరుగుతుందన్నారు.మరోసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మితే అంతా కలిసి గోదాట్లో దూకటమేనని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు మాల పల్లెల్లో కుర్చీలు వేసేవారు కాదని.. ఇప్పుడు కుర్చీలు వేసి కూర వండి, భోజనం పెట్టి మరీ బాధలు చెప్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news