ఈటెలను ఒడగొట్టడానికే రాజకీయాల్లోకి వచ్చా – కౌశిక్ రెడ్డి

-

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి 20 కోట్లు ఇచ్చి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ని చంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఈటెల సతీమణి జమున చేసిన ఆరోపణల పై స్పందించారు కౌశిక్ రెడ్డి. అసలు హత్యా రాజకీయాలు చేసేదే ఈటెల రాజేందర్ అని ఆరోపించారు. వీణవంక మండలం నర్సింగరావు గ్రామంలో ఉన్న ఎంపీటీసీ బాలరాజ్ ని ఈటెల రాజేందర్ మర్డర్ చేయించాడా..? లేదా..? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ యాదవ్ ని, సంపత్ ని థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టించి చంపించాడని ఆరోపించారు.

అప్పుడు తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రశ్నిస్తే తనపై కూడా కేసులు పెట్టించాడని అన్నారు. 2018లో మర్రిపల్లిగూడెంలో ఈటెల తనని చంపించే ప్రయత్నం చేశాడని అన్నారు. ఇప్పుడు తనకే భయంగా ఉందని.. ఈటెల తనని చంపిచడానికి ప్రయత్నిస్తాడని అనుమానం ఉందన్నారు. కౌశిక్ రెడ్డి ఉంటే మళ్ళీ తాను హుజురాబాద్ లో గెలవను అని ఈటెల అనుకుంటున్నాడని.. ఈటెలను ఓడగట్టడానికే రాజకీయాలలోకి వచ్చానని అన్నారు కౌశిక్ రెడ్డి. ఈటెలపై తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే తనకు తృప్తి కలుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news