టీడీపీకి 160 సీట్లు వస్తాయి..వైసీపీకి అచ్చెన్నాయుడు ఛాలెంజ్‌

-

టీడీపీకి 160 సీట్లు వస్తాయని….వైసీపీ పార్గీకి తెలుగు దేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఛాలెంజ్‌ విసిరారు. ఇవాళ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… వైసీపీ పార్టీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు కదా.. ఎన్నికలకు వెళదామని టీడీపీకి సవాల్‌ విసిరారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.

జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంది.. వ్యతిరేకత పెరిగితే నష్టం జరుగుతుందని.. ముందస్తుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు. త్వరలోనే ఎన్నికలు వస్తాయని ప్రజలు అనుకుంటున్నారు.. మేం కూడా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఒక వేళ ముందుస్తు ఎన్నికలు వస్తే… టీడీపీ పార్టీకి 160 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గుడ్డిగా చెప్పడం లేదు రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయని ఫైర్‌ అయ్యారు. జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ పూర్తి గా విఫలమైందని ఆగ్రహించారు అచ్చె న్నాయుడు. వైసీపీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news