ఏపీ శాసన రాజధాని లో లోకేష్ టూర్.. క్లైమాక్స్ ప్లాప్!

-

తన గురించి తాను ఎవేవో ఊహించుకోవడంలో చినబాబు లోకేష్ కు ఫస్ట్ క్లాస్ మార్కులు వేయొచ్చనేది నెటిజన్ల కామెంట్! ప్రస్తుతం ఏపీ శాసన రాజధాని ప్రాంతంలో అమరావతి రైతుల దీక్ష 300 రోజుకి చేరిన సందర్భంగా పర్యటిస్తున్న లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది! దీంతో.. కనీసం తమ్ముళ్లు, ఒక వర్గం మీడియా వరకూ “లోకేష్ @ అమరావతి” టూర్ సక్సెస్ అయ్యిందని చెబుతున్నా.. క్లైమాక్స్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అమరావతి పర్యటన కు పక్కాగా ప్లాన్ చేసుకున్న లోకేష్… ఆదివారం నాడు రాజధాని రైతుల పేరుతో ఒక ర్యాలీ మొదలుపెట్టారు! ఆ ర్యాలీవల్ల వారికి ఒరిగిన ఫలితం ఏమిటో తెలియదు కానీ… కొప్పుల రెబ్బమ్మ అనే వృద్ధురాలు ట్రాక్టర్ ఢీకొని మృతి చెందారు! చినబాబు టూర్ వల్ల, ఫలితం లేని పనివల్ల ఒక ప్రాణం బలైంది! కుటుంబంలో విషాదం నెలకొంది!

అయితే ఈ విషయాన్ని కూడా పొలిటికల్ గా క్యాష్ చేసుకుందామనో లేక ఆమె మృతిని కూడా అమరావతి కోసం మరణించిందనే ఖాతాలో వేద్దామనో తెలియదు కానీ… ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి సోమవారం అక్కడ పర్యటించారు లోకేష్! అయితే.. చినబాబు రాజకీయ తెలివితేటలు ఆ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గ్రహించారో లేక.. ఆమె మృతికి పరోక్షంగా లోకేషే కారణమని భావించారో తెలియదు కానీ.. లోకేష్ ‌ను తమ ఇంటికి రావొద్దంటూ రెబ్బమ్మ కుటుంబసభ్యులు తేల్చి చెప్పగా.. వెనక్కి వెళ్లిపోవాలని గ్రామస్తులు నినాదాలు చేశారు! దీంతో.. టీడీపీ చిన్నపులి వెనుదిరిగింది!!

Read more RELATED
Recommended to you

Latest news