ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారు – బోండా ఉమ

-

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలైన వెనుక ఎన్నికలైనా ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారని అన్నారు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు. నేడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రైతుల గొంతు కోశారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు బతకలేక పోతున్నారని.. వ్యవసాయ శాఖ మంత్రి పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు.

అధికారులు సైతం పంట నష్టం పై అంచనాలు కూడా వేయడం లేదన్నారు. ఎర్రి పప్ప కారుమూరి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగితే రైతులపై కేసులు పెడతారా అని నిలదీశారు. ఇక పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తులు పెట్టుకుంటే మీకెందుకని.. మీరు సింగిల్ గా వస్తారో లేక గోరంట్ల మాధవ్, ఆదిమూలపు సురేష్ లాగా బట్టలు విప్పుకొని వెళతారో వెళ్లాలని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news