జగన్‌పై దాడి కేసులో నన్నే ఏ-1గా పెట్టొచ్చు – బోండా ఉమ

-

సీఎం జగన్‌పై దాడి కేసులో నన్నే ఏ-1గా పెట్టొచ్చు అంటూ బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ పై దాడి సంఘటనపై బోండా ఉమా మాట్లాడుతూ.. సీఎం మీద గులకరాయి దాడి కేసును సీబీఐ ఎంక్వైరీ వేయాలని మేం డిమాండ్ చేశామని… గతంలో కోడి కత్తి తరహాలో మళ్లీ ఏదో చేస్తున్నారని అనుమానం ఉందని పేర్కొన్నారు.

వడ్డెర కాలనీలో ఆడవాళ్లని కూడా పోలీసులు కొడుతున్నారని.. సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నరును కోరామని.. జగనుకు చిత్తశుద్ధి ఉంటే తనపై జరిగిన రాయి దాడిపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్‌ చేశారు. వేముల దుర్గారావు ప్రాణాలతోనే ఉన్నాడా..? లేక వివేకాలా చంపేశారా..? అంటూ బాంబ్‌ పేల్చారు.

తప్పు చేసిన అధికారులను జైళ్లకు పంపడం ఖాయమని… కాంతి రాణా వ్యవహరంపై హైకోర్టు సీజేకు మెసేజ్ పెట్టానన్నారు. క్రిమినల్ పాలిటిక్స్ చేస్తున్నారు….ఏమైనా జరగొచ్చు.. నన్నే ఏ-1గా పెట్టొచ్చు అంటూ బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థులు ప్రచారం కూడా చేసుకోనియకుండా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news