ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె ఆపరేషన్ పూర్తి

-

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గతవారం నుంచి బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురవుతున్నారు.

Botsa Satyanarayana Undergoes Heart Surgery In Hyderabad

ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ సామాజిక సాధికార బస్సుయాత్రలో పాలుపంచుకున్న బొత్స… శృంగవరపు కోటలో అస్వస్థతకు గురయ్యారు. గతవారం రోజులుగా మంత్రి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. విశాఖపట్నంలో వైద్య పరీక్షల అనంతరం మంత్రి బొత్స కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఆయనకు ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో మంత్రి నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్య బృందం సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news