తిరుపతి జిల్లాకు రానున్న కేంద్ర మంత్రి గడ్కరీ !

-

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఇవాళ తిరుపతి జిల్లాకు రానున్నారు. 13న ఉదయం తిరుపతిలోని తారకరామా స్టేడియంలో కృష్ణపట్నం పోర్టు రహదారులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జేసి డీకే బాలాజీ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో కేంద్రమంత్రి పర్యటనపై జిల్లా అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఇక అటు ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మంగళవారం జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news