దుబ్బాకలో ప్రేమ జంట ఆత్మహత్య

-

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చాపేటలో మైనర్ జంట ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకుని ఈ జంట ఇవాళ ఉదయం బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాకకు చెందిన మైనర్‌ బాలిక (ఇంటర్‌ మొదటి సంవత్సరం), లచ్చాపేటలో పదో వార్డుకు చెందిన మైనర్‌ బాలుడు (ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం) దుబ్బాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో  చదువుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం మైనర్‌ బాలుడి కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఒకే తాడుతో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గుర్తించిన బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో ఓ లేఖ లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news