సైకిల్ స్పీడ్ పెరిగి.. ఫ్యాన్ రెక్కలు విరిగిపోతాయి – చంద్రబాబు

-

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరక్కొడుతుందని ఎద్దేవా చేశారు. చిల్లు పడిన వైసీపీ నావ త్వరలోనే మునుగుతుందన్నారు. జగన్ దుర్మార్గుడని.. 2004లో వైఎస్‌ సీఎం కాకపోవడంతో హైదరాబాద్ బతికిపోయిందన్నారు. రాజశేఖర్ రెడ్డి జగన్ కంటే 100 రెట్లు నయం కాబట్టి హైదరాబాద్ అభివృద్ధిని నాశనం చేయలేదని తెలిపారు. వికృతమైన క్రీడలతో ఆంధ్రాని జగన్ అడిస్తున్నాడని మండిపడ్డారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు.

chandrababu about jagan

పద్దతి లేని రాజకీయాలతో ఏపీని రాజధాని లేని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం చేశాడని నిప్పులు చెరిగారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల న్యాయమైన కోరికలన్నీ నెరవేరుస్తామన్నారు. పరదాలు, పోలీసుల సాయం లేకుండా బయటకు రాలేని దుస్థితి జగనుందన్నారు. డిసెంబర్ 20 తర్వాత 25 నియోజకవర్గాల్లో పర్యటించి, వచ్చే 5 ఏళ్లల్లో ఏం చేస్తామో చెప్తానని హామీ ఇచ్చారు. సైకో జగన్ను చిత్తు చిత్తుగా ఒడిస్తేనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి భవిష్యత్తు అన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news