విశాఖ దుర్ఘటనలో చంద్రబాబు హస్తం…!

-

విశాఖ గ్యాస్ దుర్ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. వేలాది మంది ఆస్పత్రుల్లో అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. ఏపీ సర్కార్ ఈ ఘటనపై అప్రమత్తమైంది. వెంటనే చర్యలు చేపట్టింది. సిఎం వైఎస్ జగన్ నేరుగా విశాఖ వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఉచిత చికిత్స అందించాలి అని ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

పరిసర ప్రాంత అధికారులు కూడా ఇప్పుడు దీనిపై చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉన్నా సరే వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు పెడుతున్నారు. విశాఖను రాజధానిగా అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు చేసారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ కుట్రను దక్షిణ కొరియా తో కలిసి చేసారని కొందరు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

దక్షిణ కొరియా కు చెందిన కార్ల తయారి పరిశ్రమ అధికారులతో చంద్రబాబుకి మంచి సంబంధాలు ఉన్నాయని, వారి సహకారంతో ఈ కుట్ర కు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు అని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. చంద్రబాబు మీద కుట్ర చేయడానికి వైసీపీ నేతలు కార్యకర్తలు ఇక్కడ కూడా దిగజారి రాజకీయం చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news