సంచలనం: బాబుకు భరోసా ఇస్తోన్న 50శాతానికిపైగా ప్రజలు!!

-

అమరావతి విషయంలో పోరాటాలు పక్కన పెట్టి ఆన్ లైన్ క్లాసులకు పరిమితమైన చంద్రబాబు… జూం యాప్ కు అద్భుతమైన పబ్లిసిటీ రప్పించిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో మరోసారి ఆన్ లైన్ లోకి వచ్చిన చంద్రబాబు… ఒక బలమైన, బరువైన మాట పలికారు. దీంతో… బాబు మాటలో నిజమున్నా.. బాబు చెబుతున్న మాటపై బాబుకే నమ్మకం ఉన్నా.. వెంటనే రంగంలోకి దిగాలని.. తాను చెప్పిన మాటను రుజువుచేసి… చంద్రబాబు అంటే ఏమిటో జగన్ కు చూపించాలని అంటున్నారు బాబు చెబుతున్న ఆ ఏపీ వాసులు!

అవును… “అమరావతి ఐదుకోట్ల ప్రజల కల.. అన్ని పుణ్యక్షేత్రాల నుంచి జలం, మట్టి తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం..” అని చెబుతున్నారు చంద్రబాబు. అదే నిజమేమో.. ఐదుకోట్ల ప్రజల కలేనేమో అని నమ్మేలోపు క్షణంలో మాట మార్చారు చంద్రబాబు. అదేమిటంటే… “రాజధానిగా అమరావతే ఉండాలని 50శాతం కంటే ఎక్కువమంది ప్రజలు కోరుకుంటున్నారు” అని అన్నారు చంద్రబాబు!

ఆయన చెబుతున్నట్లు 50శాతం మంది ప్రజలు కోరుకుంటున్నది నిజమా… ఐదుకోట్ల మంది ప్రజానికం కోరుకుంటున్నది నిజమా? సరే కాసేపు ఏదొకటి నిజం అనుకున్నా… ఈ సమయంలో చంద్రబాబు రంగంలోకి దిగాలని కోరుకుంటున్నారట ఆ 50శాతం మంది ప్రజలు! “మా అమరావతిని జగన్ పూర్తి రాజధానిగా ఉంచకుండా.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని.. అన్ని ప్రాంతాలకూ రాజధాని హోదా కల్పించాలని భావిస్తున్నారు.. ఈ సమయంలో బాబు మా 50శాతం మంది ప్రజలను నమ్మి రాజినామాలు చేయాలి” అని కోరుతున్నారు బాబు చెబుతున్న ఆ 50శాతం ఏపీ వాసులు!!

మరి బాబు చెబుతున్నట్లుగా… నిజంగా ఆ 50శాతం మందికి పైగా ప్రజలు అమరావతికి మద్దతు ఇస్తుంటే.. ఇంకెందుకు బాబు ఆలస్యం చేయడం. ప్రస్తుతానికి ఉన్న ఇరవయ్యో, ఇరవైమూడో… వారందరితో రాజినామాలు చేయించి… “ఇది బాబు సత్తా – ఇది బాబుకు ప్రజలపై ఉన్న నమ్మకం – ఇది అమరావతి విషయంలో ప్రజలు పెట్టుకున్న ఆశల నమ్మకం” అని చెప్పొచ్చుకదా… అప్పుడు కూడా జగన్ మూడు రాజధానులు అనే మాట అంటే.. ప్రజలే ఒప్పుకోరుకదా!!

మరి ఇంకెందుకు ఆలస్యం బాబుగారు.. ముందుకు దూకండి.. రాజినామాలు చేసేయండి.. మీరు చెబుతున్న ఆ 50శాతం మంది ప్రజల మద్దతుతో అమరావతి పై ప్రజలకున్న అభిప్రాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పండి అని అంటున్నారు బాబు అభిమానులు, ఆత్మీయులు!

Read more RELATED
Recommended to you

Latest news