అధికారంలోకి వస్తే రూ.2కే యూనిట్ కరెంట్ : చంద్రబాబు

-

అధికారంలోకి వస్తే రూ.2కే యూనిట్ కరెంట్ అందిస్తామని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. ప్రాజెక్టును తానే శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

YCP పాలనలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే మండలానికి ఒక వర్క్ స్టేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని స్పష్టం చేశారు. సోలార్ పవర్ తీసుకువచ్చి రూ.2కే యూనిట్ కరెంట్ ఇచ్చేలా చూస్తామన్నారు.

కాగా, నేడు శ్రీకాకుళం లో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రోజెక్ట్ ల పై యుద్దభేరి కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు. అనంతరం నాగావళి వంశధార అనుసందాన హైలెవిల్ కెనాల్ పరిశీలన చేస్తారు చంద్రబాబు. ఆ తర్వాత హిర మండలం రిజర్వాయర్‌ ను పరిశీలించనున్న బాబు….వంశధార‌ నిర్వాసితులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఇక కొత్తూరు మండల‌కేంధ్రంలో సాయంత్రం బహిరంగ సభ లో చంద్రబాబు ప్రసంగిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news