పుంగనూరు ఘటనలో చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలి – మంత్రి పెద్దిరెడ్డి

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు ఘటనలో చంద్రబాబును మొదటి నిందితుడుగా చేర్చాలని పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. పుంగనూరులో కొట్టండ్రా, చంపండ్రా అని చంద్రబాబే రెచ్చగొట్టారని అన్నారు. అనుమతి తీసుకోకుండా పుంగనూరుకు వచ్చి పోలీసులపై దాడులు చేయించారని.. దాదాపు 50 మందికి గాయాలయ్యాయని అన్నారు.

చంద్రబాబు పాలనలో తన కుమారుడైన రాజాంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా రెస్ట్ చేసి జైల్లో పెట్టించారని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చూస్తుంటే.. ముగ్గురు ఒకే స్కూల్ స్టూడెంట్స్ గా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు అందరినీ గమనిస్తున్నారని అన్నారు పెద్దిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news