ఇకపై టీడీపీ బతుకు శ్రీలంకే…నారా గొటబాయి చంద్రం బాబన్నయ్య – విజయసాయి

-

ఇకపై టీడీపీ బతుకు శ్రీలంకే…నారా గొటబాయి చంద్రం బాబన్నయ్య అంటూ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. ఏపీ అప్పులపై విపక్షాలు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల్లో ఆంధ్రాది అగ్రస్థానమని పచ్చ కుల మీడియా విష ప్రచారం కేంద్ర ప్రభుత్వ సమాధానంతో పార్లమెంట్ సాక్షిగా తేలిపోయిందన్నారు.

ఇకపై టీడీపీ బతుకు శ్రీలంకే…నారా గొటబాయి చంద్రం బాబన్నయ్య!రాష్ట్రం పచ్చగా ఉంటే తట్టుకోలేడని చురకలు అంటించారు. సాగు బాగుగా సాగితే చూడలేడు. పక్క రాష్ట్రం నుంచి దిగుతాడు. పచ్చ కుల మీడియాతో కలిసి కుట్రలెన్నో పన్నుతాడు. ఇంతకూ ఆ పచ్చ ముఠా నాయకుడెవరు ? అని నిలదీశారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.

2016లో అకాల వర్షాలకు 19 మంది మృతి. 2017లో భారీ వర్షాలకు 31 మంది దుర్మరణం. తిత్లీ తుఫానుకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు భారీ వరదలకు ప్రాణనష్టం లేదు. అందుకే ఎక్కడ శవం దొరుకుతుందా అని రాబందులా తిరుగుతున్నారు టీడీపీ అంతర్జాతీయ అధ్యక్షుడు మా బాబు అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news