ఆయన మాట వినకపోవడం వల్లే చైతూ పరిస్థితి ఇలా మారిందా..?

-

కూల్ అండ్ కామ్ గా.. ఎలాంటి వివాదాలలోకి దూరకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్న హీరోలలో మొదటి స్థానంలో నాగచైతన్య ఉంటారు అనడంలో సందేహం లేదు. ఎప్పుడూ కూడా ఎవరితో ఆయన గొడవలు పడింది లేదు. ఇక ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నాగచైతన్య ఒక మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ కితాబు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల సమంతను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత ప్రతి రోజు ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు చైతన్య. అటు సినిమాల పరంగా బిజీగా ఉన్నప్పటికీ ఇటు మాజీ భార్య సమంత విషయంలో ఎప్పటికప్పుడు ట్రోల్స్ కి గురవుతున్నాడు. ఇక ఎంతో ప్రశాంతంగా ఉన్న తన జీవితంలోకి పెను ధ్రువంలా సమంత వచ్చి ఆయన జీవితం లో అల్లకల్లోలం సృష్టించిందని చైతూ అభిమానులు కూడా సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ రోజు చైతన్య ఇలా కావడానికి కారణం ఆయన మాట వినకపోవడమే అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఆయన ఎవరో కాదు నాగచైతన్య తండ్రి నాగార్జున. నాగార్జున కి సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది పెద్దలతో సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక చైతూ..సమంత ను వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు ఇండస్ట్రీలో ఉండే అందరితో కూడా నాగార్జున సమంత గురించి ఎంక్వైరీ చేసినట్లు సమాచారం.కానీ వాళ్ళు చెప్పిన మాటలకు నాగార్జున సమంతను తన ఇంటి కోడలుగా ఒప్పుకోక చైతన్యకు కూడా ఎంతో చెప్పే ప్రయత్నం చేశారట. కానీ నాగచైతన్య సమంత ప్రేమ మైకంలో పడి మునిగి తేలుతూ ఉండడం.. సమంతనే వివాహం చేసుకుంటానని పట్టు పట్టడంతో చేసేదేమీ లేక వారిద్దరికి వివాహం జరిపించినట్లు సమాచారం.

అయితే అందరూ చెప్పిన మాటల ప్రకారం.. సమంత ఒక స్వేచ్ఛ విహారి అని, తనను పంజరంలో బంధిస్తే ఉండలేదు అని , ఎంతకైనా వెళ్తుంది అని, తనకు చెప్పినట్లు.. ఇక అక్కినేని కుటుంబ సంప్రదాయాలు ఆమె వంట పట్టించుకోలేదని చెప్పినా కూడా నాగచైతన్య వినలేదట. ఇక ఆ రోజు తన తండ్రి మాటలు వినకపోవడం వల్లే ఇలా ఈ రోజు మానసిక క్షోభకు గురవుతున్నాడు అని ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news