అంబేద్కర్ విగ్రహం పై చంద్రబాబు రాజకీయం : మంత్రి మేరుగు

-

ప్రపంచంలో ఎక్కడలేని విధంగా అంబేద్కర్ మహా శిల్పం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గతంలో 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని పెట్టలేదన్నారు. అంబేద్కర్ స్మారక చిహ్నాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

ఎల్లో మీడియాలో పనులు పూర్తి అవ్వలేదంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారని.. చంద్రబాబు ఇక్కడికి వస్తే పనులు చూపిస్తానన్నారు. రూ.400 కోట్లు పెడితే ఎందుకు అంత ఖర్చు అని టీడీపీ నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం పై చంద్రబాబు చేసిన రాజకీయాన్ని ప్రజల్లో ఎండగడతామని మంత్రి పేర్కొన్నారు. రేపు విజయవాడలో డా.బీ.ఆర్. అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. తొలుత ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమత సంకల్ప సభకు హాజరు కానున్నారు సీఎం జగన్. అనంతరం స్వరాజ్ మైదానంలో సామాజిక న్యాయ మహా శిల్పాన్ని ఆవిష్కరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news