అనాథనంటూ పెళ్లి చేసుకుని డబ్బు, నగలతో పరారీ.. తిరుపతిలో నిత్య పెళ్లి కుతూరు అరెస్ట్

-

తిరుపతి: నిత్య పెళ్లికూతురు సుహాసినిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 3న సుహాసిని మూడో భర్త సునీల్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు ఆమెను పట్టుకున్నారు. తిరుపతిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. అనాథ అంటూ పెళ్లి చేసుకుని లక్షల రూపాయలు నగదు, నగలతో పరారీ అయినట్లు భర్త సునీల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుని తనను మోసం చేసిందని రెండో భర్త వినయ్ కూడా ఖాకీలకు కంప్లైంట్ చేశారు.

కాగా చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన సునీల్ మార్కెటింగ్ జాబ్ చేస్తున్నారు. ఓ ఫైనాన్స్ కంపెనీలో సుహాసిని పని చేసేది. ఈ క్రమంలో సునీల్‌తో సుహాసిని పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే సునీల్ నుంచి రూ. 2 లక్షలను సుహాసిని తీసుకున్నట్లు సునీల్ తెలిపారు. పెళ్లి తర్వాత సునీల్ మామ నుంచి మరో రూ. 2 లక్షలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంపై ఆమెను భర్త సునీల్ నిలదీయడంతో ఇంట్లో డబ్బుల, నగలు తీసుకుని వెళ్లిపోయింది.

ఆమె ఇంటి నుండి వెళ్లి పోయిన కొంత కాలానికి ఆమె గదిలో దొరికిన ఆధార్ కార్డులో నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తితో పెళ్లైనట్టుగా గుర్తించారు. ఈ విషయమై సుహాసినిని సునీల్ నిలదీశాడు. తనకు మరో పెళ్లి కూడా జరిగిందని చెప్పడంతో సునీల్‌ షాక్‌కు గురయ్యారు. దీంతో తాను మోసపోయినట్టుగా గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news