వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు

-

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. బోటు అధికారులతో కలిసి సీఎం పర్యటించారు. దాదాపు మూడు గంటల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా విజయవాడలోని సింగ్ నగర్ లో వరద బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు సింగ్ నగర్ వరద ప్రాంతాన్ని పరిశీలించారు.  విజయవాడ సింగ్ నగర్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. 

సింగ్ నగర్ తో పాటు రామలింగేశ్వర నగర్, జక్కంపూడి, బుడమేరు, దేవినగర్ కాలనీ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. సహయక చర్యల పరిశీలన చేశారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడారు. ఆహారం అందుతుందా..? లేదా..? అనే అంశంపై ఆరా తీసారు చంద్రబాబు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలక్టరేట్ కు చేరుకున్నారు చంద్రబాబు. కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు సమీక్షలో  మంత్రులు నారా లోకేష్ ,అచ్చెన్నాయుడు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర హోం మంత్రి అనిత తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news