వెంకయ్యనాయుడు, చిరంజీవిలకు సీఎం జగన్ అభినందనలు

-

వెంకయ్యనాయుడు, చిరంజీవిలకు సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినీనటుడు చిరంజీవి గారికి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన పద్మవిభూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ హర్షం వ్యక్తంచేశారు. వారికి తన అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో పద్మ అవార్డులను దక్కించుకున్న వారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

CM Jagan congratulates Venkaiah Naidu and Chiranjeevi

ఇక అటు తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కళాకారులకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ నుంచి ఇద్దరు కళాకారులు పద్మశ్రీ అవార్డులను దక్కించుకున్నారు. పలు రంగాల్లో విశేష సేవలను అందించిన వారికి ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news