ఏపీ మహిళలకు సీఎం జగన్ శుభవార్త.. త్వరలోనే మరిన్ని మహిళా మార్ట్ లు

-

ఏపీ మహిళలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. నిన్న జగనన్న మహిళా మార్ట్‌ల పై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో ఏపీలో మహిళా మార్ట్‌లు నడుస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న మహిళా మార్ట్‌లను వివరాలను సిఎం జగన్ మోహన్ రెడ్డికి అధికారులు వివరించారు. విజయవంతంగా నడుస్తున్నాయన్నారు అధికారులు.

వీలైనన్ని ఎక్కువ మహిళా మార్ట్‌లను నెలకొల్పాని ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి తగినంత సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మహిళా మార్ట్‌ల కోసం వివిధ ప్రాంతాల్లో మంచి భవనాలను గుర్తించాలన్నారు సీఎం జగన్. అలాగే కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్లపై దృష్టి పెట్టండి.. ఎక్కడైనా గుంతలులేని రోడ్లు కనిపించాలని కోరారు వైఎస్ జగన్. నాడు – నేడు కింద బాగు చేసిన రోడ్లను చూపించాలని.. జూన్‌ నాటికి రోడ్ల పనులు పూర్తి చేస్తామని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news