ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

-

ఆంధ్రప్రదేశ్ లో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 17 లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల ఫైల్ పై సీఎం వైఎస్ జగన్ సంతకం చేశారు. ఈ క్రమంలో బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు తదితర నిబంధనలతో రేపు లేదంటే ఎల్లుండి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేసిన సమయంలో అధికార యంత్రాంగానికి సీఎం జగన్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఉద్యోగుల బదిలీలు అన్నీ ఈనెల 17లోగా పూర్తి అయ్యేలా చూడాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేకుండా బదిలీల ప్రక్రియను ముగించాలని కూడా ఆయన సూచించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news