ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ప్రస్తుతం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. మరికాసేపట్లో గన్నవరం నుంచి ప్రత్యేక అభిమానంలో బయలుదేరిన సీఎం రాత్రి 6:45 గంటలకు ఢిల్లీ చేరుకొని 1 జెన్ పధ్ నివాసంలో రాత్రి బస చేయనున్నారు. ఇక మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్ లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

వివిధ దేశాల దౌత్యవేతలు, ఫిక్కీ, సిఐఐ ప్రతినిధులు పాల్గొననున్న ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సన్నాహక సదస్సులో సీఎం జగన్ పాల్గొని ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి రాత్రి 8:50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news