రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే బతుకుతాడు, అప్పుల్లోనే చనిపోతాడు – సీఎం జగన్‌

-

రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే బతుకుతాడు, అప్పుల్లోనే చనిపోతున్నాడని ఏపీ సీఎం జగన్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. వజ్రోత్సవ వేడుకలకు సింబల్ గా 60 గులాబీల పుష్ప గుచ్చంతో సీఎం జగన్ కు స్వాగతం పలికారు మంత్రి కాకాణి.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సహకార రంగ చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఆప్కాబ్ షష్టిపూర్తి జరుపుకుంటోందని.. 60 ఏళ్ళ ప్రయాణంలో రైతులకు అండగా నిలబడింది ఆప్కాబ్ అంటూ కొనియాడారు. భారత రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే బతుకుతాడు, అప్పుల్లోనే చనిపోతాడు అని ఒక నానుడి ఉండేదన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు దగ్గర అడుగులు వేయటంతో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news